కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందకు ముసాయిదాను రెడీ చేయాలని సుప్రీంకోర్టు యూజీసీని ఆదేశించింది. కాలేజీల్లో కుల వివక్షపై గతంలో పిటిషన్ దాఖలు కాగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి సిద్ధం చేసిన 2012 రూల్స్ ప్రకారం ఎన్ని ఈక్వల్ అపార్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని పేర్కొనింది.