ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్బంగా అందరినీ కోరారు. ఇవాళ అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోందని అన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు లక్షన్నరకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.