AP: రాష్ట్ర యువతకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 534 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరిక మేరకు ఆర్థిక శాఖ స్పందించి పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.