టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సా. 4గంటలకు బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7గంటలకు నిర్వహించే సభలో బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. గురువారం డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. అంబాజీపేటలో సాయంత్రం 4 గంటలకు, అమలాపురంలో రాత్రి 7గంటలకు ప్రసంగిస్తారు.