AP: జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామశించారు. మురళీనాయక్ కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మురళీనాయక్ కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ అనే సైనికుడు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.