ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానిపై ఛీటింగ్ కేసు

81చూసినవారు
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానిపై ఛీటింగ్ కేసు
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనానితో పాటు మరికొందరిపై ఛీటింగ్ కేసు నమోదైంది. ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఓ ప్రమాదంలో సచివాలయ వాలంటీర్ నాగమణి గాయపడింది. నాగమణిని ఆదుకుంటామని ఆళ్లనాని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని ఆళ్లనాని మర్చిపోయారంటూ నాగమణి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఆళ్లనానితో పాటు మరికొందరిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్