అనకాపల్లిలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన బాణాసంచా పేలుడులో మృతుల కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులకు చెక్కులు అందించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. పేలుడులో మృతి చెందిన గోవింద్ కుమారుడు మహేశ్ను చదివించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటాని మంత్రి తెలిపారు.