తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం సాయంత్రం మంత్రి ఎస్. సవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు, ఆలయ ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మంత్రికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.