రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి

66చూసినవారు
తిరుపతి రూరల్ మండలం, దుర్గసముద్రంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని చెప్పారు. రెండు రోజుల్లోపే అర్హులందరికీ పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్