జీడీనెల్లూరు మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు వైపు వెళ్తున్న మినీ లారీ. పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయే క్రమంలో మరికొరని ఢీకొట్టి బోల్తా కొట్టింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు విచారణ చేపడుతున్నారు.