చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర 7వ రోజు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సదుం మండలం అమ్మగారిపాలెం వద్ద సీఎం ప్రజలను కలిశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రజలు పలువురు జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.