కుప్పం మునిసిపల్ పరిధిలోని 17 వార్డు తపాల్ రాజ్ వీధిలో శనివారం ఎమ్మెల్సీ భరత్ వార్డు బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ భరత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు.