ఎమ్మెల్సీ భరత్ కు నిరసన సెగ

76చూసినవారు
వైసిపి ఎమ్మెల్సీ భరత్ కు నిరసన సెగ ఎదురైంది. రామకుప్పం మండల వైసిపి ఎంపిటిసీలు, సర్పంచులతో వైసిపి నాయకుడి గెస్ట్ హౌస్ లో భరత్ గురువారం సమావేశం అయ్యారు. టీడీపీ శ్రేణులు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని గో బ్యాక్ భరత్ అంటూ నినాదాలు చేశారు. 5 సంవత్సరాలు తమను వేదించిన భరత్ కుప్పంలో తిరిగితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని టీడీపీ నాయకులకు నచ్చచెప్పారు.

సంబంధిత పోస్ట్