రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద ఆధినిక పద్దతులలో పండిస్తున్న ద్రాక్ష తోటలను శుక్రవారం తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థులు పరిశీలించారు. పంట సాగు విధానం, లోటుపాట్ల గురించి అధ్యాపకులు విద్యార్థులుకు వివరించారు. వ్యవసాయంలో మెలుకువలను రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పంటల సాగు గురించి అవగాహన కల్పించేందుకు వచ్చినట్లు అధ్యాపకులు పేర్కొన్నారు.