నగిరి నియోజకవర్గంలోని మండలాల్లోని అన్ని చోట్ల ఆదివారం ఉదయాన్నే పొగమంచు కురుస్తోంది. రోడ్లు కూడా కనపడనంతలా మంచు ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కనీసం ఐదు అడుగుల దూరంలో వచ్చేటువంటి వాహనాలు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు.