నగిరి పట్టణంలో ప్రజలు బుదవారం గ్యాస్ పుస్తకాలను తీసుకెళ్లి ఈకేవైసీ చేసుకోవడానికి వినియోగదారులు ఏజన్సీల వద్ద బారులు తీరుతున్నారు. వెలుగు పథకంలో ఉన్నవారికే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇండేన్ గ్యాస్ ఏజన్సీ ముందు వినియోగదారులు క్యూకడుతున్నారు. కొన్ని గంటల పాటు వేచి ఉండి మరీ ఈకేవైసీ చేసుకొని వస్తున్నారు.