పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామివారి పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవాలు, సేవల్లో జరిగిన చిన్నపాటి దోషాలను నివారించి సంపూర్ణ ఫలాన్ని మానవాళికి అందించేందుకు పవిత్రోత్సవాలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలతో పాటు పవిత్రోత్సవాలను అందజేశారు.