సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం పంచాయతీ కార్యాలయంలో గురువారం తహశీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. చెరువు ఆక్రమణ, గోవర్ధనపురం మారేడు కాలువతోపాటూ పలు ఆక్రమణలపై తహసీల్దార్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్, దేవాదాయ, విద్యుత్తు, పోలీస్, ఆర్ ఆడ్ బీ శాఖల అధికారులు సదస్సుకు హాజరు కాకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.