తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రాజానగరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత రవి మాతృమూర్తి రోశమ్మ గురువారం మధ్యాహ్నం మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేటి గ్రామానికి చేరుకుని రోశమ్మ భౌతికాయానికి నివాళులు అర్పించారు. అనంతరం రవి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.