తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం తంగేడిపాలెం గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు - టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.