తిరుపతి జిల్లా సత్యవేడు మండలం పేరడం గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. స్థానికులు తమ భూ సమస్యలను పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రెవెన్యూ సదస్సుకు బర్రెలు తీసుకువచ్చి నిరసన తెలిపారు. తమ భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.