తిరుపతి నగరంలో 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అమలులో ఉంటుందని కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ సోమవారం తెలిపారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.