తిరుమల శ్రీవారి భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వోలు పాల్గొన్నారు.