తిరుపతి: ఆకట్టుకున్న విద్యార్థులు శ్లోకాలు

85చూసినవారు
తిరుపతి: ఆకట్టుకున్న విద్యార్థులు శ్లోకాలు
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చ‌దువుకుంటున్న విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆల‌పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్