తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య శనివారం సాయంత్రం‘పురమిత్ర’ మొబైల్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా నగరంలోని పౌరులు మునిసిపల్ సంబంధిత సేవలను డిజిటల్గా అందుకోవచ్చని ఆమె వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ యాప్ పౌరుల జీవితాన్ని సులభతరం చేస్తుంది. అన్ని సేవలు టచ్లో ఉండేలా మేం ప్రణాళిక వేసామని మౌర్య పేర్కొన్నారు.