తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుండి వచ్చే వినతులను వారు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక, రోడ్ల మరమ్మతులు, పన్నుల వసూళ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం, పారిశుద్ధ్యం, అధికారిక నియమాలు తదితర అంశాలపై సమావేశమై సమీక్షించారు.