కరెంట్ ఛార్జీల పెంపును ఖండిస్తూ వైసీపీ నాయకులు గత డిసెంబర్ 27న వెంకటగిరి పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ క్రమంలో తనపై దాడి చేశారంటూ టీడీపీ నేత, మాజీ ఏఎంసీ ఛైర్మన్ సీసీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ1గా వైసీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డితో సహా 12 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. మరికొందరు అనుమానితులను ఈ కేసులో చేర్చుతారని తెలుస్తోంది.