చంద్రగిరి: తృటిలో తప్పిన ప్రమాదం
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి మదనపల్లె, పీలేరు వెళ్లే ఆర్టీసీ బస్సులు భాకరాపేట సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అవ్వడంతో ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. అద్దాలు పగలగా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.