చంద్రగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలాలవారీగా సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామని, చంద్రగిరిని సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాని స్పష్టం చేశారు.