తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్న గొట్టిగల్లు మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం భాకరాపేట శివారు ప్రాంతంలోని వడ్డేపల్లి ప్రాంతంలో రైతు పంట పొలాల్లో స్వైర విహారం చేశాయి. గురువారం ఉదయానికి చిట్టేచర్ల పంచాయతీ బొంతినేనివారిపల్లి గ్రామంలో టమాటా పంట, వరి పైరును తొక్కి నాశనం చేశాయి. రైతులు లబోదిబో అంటున్నారు.