చంద్రగిరి: తెప్పపై విహరించిన శ్రీపద్మావతీ అమ్మవారు

62చూసినవారు
చంద్రగిరి: తెప్పపై విహరించిన శ్రీపద్మావతీ అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మంగళవారం పద్మ సరోవరంలో శ్రీపద్మావతీ అమ్మవారు తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్