చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పాకాల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాకాల రైల్వే గేటు నుండి రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ జరిగింది. వేలాది మంది కార్యకర్తలు, యువత, పార్టీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. “వందేమాతరం”, “ఉగ్రవాదం నశించాలి”, “జైహింద్”, “జైజవాన్” అనే నినాదాలతో పట్టణం మారుమోగింది.