తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయిని, భక్తులు ఒక్కొక్కరు రూ. 150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చునని టీటీడీ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.