ట్రేడింగ్లో లాభాలు వస్తాయని నమ్మబలికి తిరుపతి రూరల్ తారకరామనగర్కు చెందిన టెక్నికల్ ట్రైనర్ రూ. 34లక్షలు మోసపోయాడు. ఓ ప్రైవేటు సంస్థ పేరుతో వచ్చిన వాట్సాప్ కాల్ ఆధారంగా, లింకులు పంపించి ట్రేడింగ్ యాప్లో లాగిన్ చేయించారు. మొత్తంగా రూ. 34లక్షలు పంపిన తర్వాత ఖాతాలో రూ. 1. 5కోట్లు లాభంగా చూపించి, విత్డ్రా కోసం రూ. 28లక్షలు డిమాండ్ చేశారు. మోసం తెలుసుకున్న బాధితుడు శనివారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.