తిరుపతి రూరల్ తుమ్మలగుంట పంచాయతీలో గ్రామస్తుల శుక్రవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. కేవలం 7నెలలకే బదిలీ చేసిన పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మళ్లీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయన పని తీరుతో గ్రామఅభివృద్ధి పటిష్టంగా సాగిందని గ్రామస్తుల అన్నారు. 13నెలల్లో రిటైర్ కావలసిన వ్యక్తిపై అనవసర బదిలీకి నిరసనగా సచివాలయం ముందు ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొని బదిలీ వెనక్కి తీసుకోవాలన్నారు.