చంద్రగిరి పాతపేట రాయలకోటకు చెందిన బుద్ధాల సిద్దయ్య రెండవ కుమారుడు బి. మోహన్ సాయి (26) శనివారం తాటికాయల కోసం తాటి చెట్టుపైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడి గాయపడ్డాడు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మోహన్ సాయి మృతిచెందాడు. ఆదర్శవంతమైన యువకుడిగా పేరున్న మోహన్ సాయి అకాలమరణంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.