తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళం గ్రామానికి చెందిన వివాహిత హేమలత తన నివాసంలో శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. హేమలత కొంతకాలంగా భర్త సుబ్బుకు దూరంగా ఉంటోంది. ఇటీవల విజయ్ తో సహజీవనం చేస్తోంది. వీరి మధ్య కొన్నిరోజులుగా కలహాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆమె ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.