తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామివారు శనివారం రాత్రి గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.