చంద్రగిరి మండల పరిధిలోని శ్రీవారిమెట్టు వైపు ఉన్న శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్న కొందరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి కారు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ కళ్యాణీ డ్యాం వైపు వెళ్లి శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేశారు. ఈ క్రమంలో నాగపట్ల సెక్షన్ పరిధిలో కారులో వచ్చిన స్మగ్లర్లను గుర్తించి అరెస్టు చేశారు.