తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామానికి చెందిన డా. కనుమూరు సునీత నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. సునీత తండ్రి కనుమూరి భాస్కర్ నాయుడు ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.