కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శనివారం ఆలయ ఈవో పెంచల కిషోర్ కీలక ప్రకటన చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రొటోకాల్, వీఐపీ ద్వారా దర్శనం చేసుకునే వారు, వారి కుటుంబసభ్యులు మినహా. సిఫార్సులపై వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా టికెట్లు తీసుకోవాలన్నారు. ఇకపై ఆలయ ఉద్యోగులు కూడా విధిగా టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లాలన్నారు. ఈ విధానం ఈ రోజు (శనివారం) నుంచే అమలవుతుందన్నారు.