మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి కోర్టు జరిమానా విధించిందని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. శుక్రవారం చిత్తూరులో వాహనాలు తనిఖీ చేయగా పది మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు తెలిపారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున విధించారని వెల్లడించారు.