చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 101 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మణికంఠ శుక్రవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వారికి రూ. 27, 295 జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.