చిత్తూరులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అవుట్ సోర్సింగ్, ఒప్పంద, తాత్కాలిక బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తోన్న 8 మందిని గురువారం తొలగించారు. ఈ సందర్బంగా దేవదాయశాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, నగదు ఉంచుకోవడాన్ని గుర్తించిన అధికారులు జి.సురేష్, బి. కరుణాకర్, కె.తేజేష్, ఎ. చిదంబంరం, వి.కనకరాజులు, హరిబాబు, పృథ్వీరాజ్, బాలకృష్ణలను విధుల నుంచి తొలగించారు.