కత్తితో బెదిరించి నగదు, సెల్ ఫోన్ అపహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ బుధవారం తెలిపారు. జానకారపల్లికి చెందిన అజయ్ కత్తితో తనను బెదిరించినట్లు నగరానికి చెందిన మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు పంపించినట్లు సీఐ తెలిపారు.