సంక్రాంతి సెలవుల్లో ప్రైవేట్, కార్పోరేట్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఈఓ వరలక్ష్మి గురువారం హెచ్చరించారు. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయన్నారు. ఈ సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపారుఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారన్నారు. ఆ సెలవులను ఫిబ్రవరి నెలలో సర్దుబాటు చేస్తామన్నారు.