చిత్తూరు జిల్లా కే.వి.పల్లి మండలం తిమ్మాపురంలో ఆదివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రెండు కుటుంబాలు ఇసుక విషయంలో గొడవపడ్డాడు. ఈ ఘటనలో చిన్నారులతో సహా 10 మందికి గాయాలైవ్వగా.. రవి, తేజస్, శ్రావణి, భారతి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.