చిత్తూరు: మామిడి గుజ్జు పరిశ్రమను తనిఖీ చేసిన కలెక్టర్

76చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని జైన్ ఫామ్ ఫ్రెష్ మామిడి గుజ్జు పరిశ్రమను మంగళవారం రాత్రి కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి కొనుగోళ్ల వివరాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరనే రైతులకు అందించాలని వారు సూచించారు. వారి వెంట హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్