మామిడి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి గురువారం తెలిపారు. చిత్తూరు జిల్లాలో 60 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుంది. భవిష్యత్తులో మామిడి డిమాండ్ ఆధారంగా ఆయిల్ ఫామ్, చింత, బొప్పాయ వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తుంది. ఎస్ ఆర్ పురం, కార్వేటినగరం, జిడి నెల్లూరులో ఆయిల్ ఫామ్ పంటకు పైలట్ ప్రాజెక్టుగా గుర్తించామన్నారు.