దశాబ్ద కాలానికి పైగా చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను కలెక్టర్ సుమిత్కుమార్ పట్టుకున్నారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన వైద్యశాఖ అధికారుల ఫిర్యాదుతో సుమారు రెండు నెలల పాటు నిఘా వుంచిన కలెక్టర్.. ఎవ్వర్నీ నమ్మకుండా ఒంటరిగా వెళ్లి పట్టుకున్నారు.పరీక్షా కేంద్రంతో పాటు యంత్రాలను సీజ్ చేసి.. 11 మంది గర్భిణుల్ని, ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.